ASR: మన్యం ప్రాంతంలో లేత పనసకాయలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఏర్పడింది. అడవుల నుంచి సేకరించిన కాయలను గిరిజనులు ఒక్కోటి రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యాపారులు వీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి అక్కడికి తరలిస్తున్నారు. అనంతరం ఒక్కో కాయను సుమారు రూ.40 చొప్పున వారు విక్రయిస్తున్నట్లు సమాచారం.