MDK: జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ఆదివారం చాకరిమెట్ల హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు.