AP: రాష్ట్రంలో జనాభా తగ్గిపోతుండటం ఆందోళన కలిగించే విషయమని CM చంద్రబాబు అన్నారు. ‘జనాభా పెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం. మహిళలు స్వయం బ్రాండ్ మీదే ఉత్పత్తులు తయారు చేయాలి. అవే ఉపయోగించాలి. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తా. మీ ఆలోచనలతో ఈ బ్రాండ్ను మరింత అభివృద్ధి చేయాలి’ అని సూచించారు.