SDPT: హుస్నాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మహిళా కానిస్టేబుల్స్కి ఎస్సై లక్ష్మారెడ్డి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాలలో మహిళలు ముందుకు నడవాలని తెలిపారు. అలాగే జిల్లాలో మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.