VKB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సిబ్బందిని మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ సన్మానించారు. అనంతరం HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రవీందర్ యాదవ్, వైస్ ఛైర్మెన్ శంకర్ నాయక్, డా.సాకెత్, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.