TG: గాంధీ విగ్రహం కట్టడానికి రూ.500 కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని CM రేవంత్ మండిపడ్డారు. గాంధీ విగ్రహానికి రూ.70 కోట్లే ఖర్చు చేస్తున్నామని.. గాంధీ విగ్రహం దగ్గర విజ్ఞాన కేంద్రానికి రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. మహిళలకు రక్షణ మాత్రమే కాదని.. అవకాశాలు కూడా ఇస్తామన్నారు. నెట్టింటిలో అవాస్తవాల ప్రచారంపై ఫిర్యాదులకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.