ప్రకాశం: మార్కాపురం జిల్లాలో జూన్ 1న నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనించి తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేయాలని కోరారు. కాగా ఇటీవల ఎండల నేపథ్యంలో ఉదయం 8 గంటలకే నిర్వహించిన విషయం తెలిసిందే.