AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. పాలలో ఇథలిన్ గ్లైకాల్ కలిసినట్లు గుర్తించారు. కిడ్నీ ఫెయిల్యూర్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో.. బాధితులు చనిపోయినట్లు FSL, RFSL రిపోర్టులో వెల్లడైంది. గత నెల 16న ఫ్రిడ్జ్ను రిపేర్ చేయించిన గణేష్.. లీకైన్ కంటైనర్కు ఎంసీల్ అంటించాడు. రిపోర్టు ఆధారంగా అధికారులు గణేష్పై చర్యలు తీసుకోనున్నారు.