GDWL: జిల్లాలోని గట్టు మండలం బ్లాక్, నీతి ఆయోగ్ నిర్వహించే ‘బెస్ట్ ప్రాక్టీసెస్’ ప్రాంతీయ సెమినార్కు ఎంపికైంది. ఈ నెల 9న విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమంలో, విద్యలో గట్టు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను 6 రాష్ట్రాల ప్రతినిధుల మధ్య ప్రదర్శించనున్నారు. ఈ గుర్తింపు జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.