RR: చేవెళ్ల పరిధి అంతారం గ్రామ సర్పంచ్ రామస్వామి మిషన్ భగీరథ డీఈ హారికను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతారం గ్రామంలో పాత వాటర్ ట్యాంక్ వినియోగానికి అనుకూలంగా లేకపోవడంతో దాని స్థానంలో కొత్త ట్యాంక్ నిర్మించాలని డీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యుడు ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.