JN: స్టేషన్ ఘణపూర్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో నెలకొన్న డ్రైనేజ్ సమస్యపై మున్సిపల్ ఛైర్ పర్సన్ తాటికొండ వినయ్ కుమార్, కౌన్సిలర్ బొల్లు లక్ష్మీ స్పందించారు. శనివారం ప్రతాప్ టెంట్ హౌస్ వద్ద డ్రైనేజ్పై నిర్మించిన సీసీని తొలగించేందుకు నోటీసులు ఇచ్చారు. మురుగు నీరు మంచినీటిలో కలుస్తున్న సమస్యపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు.