NLG: చండూరు మండల ప్రజల కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం (రేపు) మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆపరేషన్లు అవసరమైన వారికి హైదరాబాద్లో ఉచితంగా చేయిస్తామని వెల్లడించారు.