బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. మార్చి 15న జరగనున్న ఆస్కార్ వేడుకల్లో ఆమె ప్రజెంటర్గా వ్యవహరించనుంది. హాలీవుడ్ ప్రముఖులతో కలసి ఆమె ఒక విజేతకు అవార్డు అందించనుంది. దీంతో ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లోనూ ఆమె ప్రజెంటర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.