TPT: సత్యవేడు మండలం కొత్తమారికుప్పం పంచాయతీ ఇంద్రపురం కాలనీలో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణానికి జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నఈటిపాకం, రాచపాలెం, ఇంద్రపురం ప్రాంతాల్లో సీసీ రోడ్లు, కాలమనాయుడుపేటలో కల్వర్టు నిర్మాణం సహా మొత్తం రూ.18 లక్షల జడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.