KMM: కామేపల్లి మండలం పండితాపురం వారాంతపు సంత వేలం ఈనెల 13న ఉదయం 11 గంటలకు కృష్ణప్రసాద్ పశువుల బహిరంగ వేలం సంత లో జరగనుంది. ఈ విషయన్ని కొమ్మినేపల్లి సర్పంచ్ ధరావత్ అనురాధ, కార్యదర్శి శంకర్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలులో ఉండే ఈ వేలంలో, పీసా చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్టీలకు మాత్రమే అర్హత ఉంటుందని వారు వెల్లడించారు.