కృష్ణా: వీరవిల్లిలో ఓ విద్యార్థి ఉపాధ్యాయుడిపై దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై DEO సుబ్బారావు స్పందించారు. గురువారం పాఠశాలను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లల్లో క్రమశిక్షణ లోపమని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తుందని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి విద్యార్థి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని విచారణ చేయనున్నట్లు చెప్పారు.