ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ తన పాటల ఎంపికపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘చిక్ని చమేలి’ వంటి పాటలు పాడే సమయంలో సాహిత్యంపై తనకు అవగాహన లేదని, ఆ పాటలను చిన్న పిల్లలు పాడుతుంటే తనకు ఇబ్బందిగా అనిపించేదని వెల్లడించారు. అందుకే సామాజిక బాధ్యతతో ఇకపై ఐటెం సాంగ్స్ పాడకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. విలువలకు ప్రాధాన్యం ఇస్తున్న ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.