ATP: పామిడిలోని సత్యసాయి తాగునీటి శుద్ది కేంద్రాన్ని బుధవారం జిల్లా పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూర్యనారాయణ, గుత్తి మున్సిపల్ డీఈఈ హేమచంద్ర పరిశీలించారు. రానున్న వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం తాగునీటి శుద్ధి కేంద్రంలోని మోటార్ల పనితీరును పరిశీలించారు.