NLG: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లింలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని 30వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ జాంగిర్ బాబా డిమాండ్ చేశారు. షాదీ ముబారక్తో పాటు తులం బంగారం అందించాలని, ఇమామ్, మౌజంల వేతనాన్ని రూ. 6 నుంచి రూ. 12 వేలకు పెంచాలని కోరారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.