JN: దేవరుప్పుల మండలం కడవెండి గ్రామ పరిధిలోని శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పైకి వెళ్ళే రోడ్డు నిర్మాణం కోసం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వచ్చి దాన్ని పూర్తి చేస్తాం అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదన్నరు.