KRNL: నందవరం (మం) ముగతి సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచూరులోని సైదాపూర్ చక్కర ఫ్యాక్టరీ నుంచి కడప(D) ప్రొద్దుటూరుకు చక్కెర లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ శివకుమార్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. డ్రైవర్తో పాటు క్లీనర్కు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు విచారణ చేపట్టారు.