PDPL: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన కలెక్టర్ల సదస్సులో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. 99 రోజుల కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించారు. సోలార్ వినియోగాన్ని ప్రోత్సహించి, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సభల్లో వెల్లడించాలని ఆదేశించారు.