MDK: నిజాంపేట మండలం నందిగామ గ్రామ చెరువు కట్టను ఇరిగేషన్ ఏఈ శ్రీనిధి ఇవాళ పరిశీలించారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కట్టకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేశారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్న, తదితరులు పాల్గొన్నారు.