MHBD: రాష్ట్రంలో వచ్చేది BRS ప్రభుత్వమే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు, మహిళల సమస్యలు వదిలిపెట్టి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కమిషన్ల కోసం కొట్లాడుతున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్, వైస్ చైర్మన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం సరికాదన్నారు.