SRD: సేవాలాల్ మహారాజ్ ఆలోచన విధానాలతో ప్రతి ఒక్కరూ కూడా భక్తి మార్గంలో నడవాలని దక్షిణ కాశీ సేవాలాల్ ఘడ్ పీఠాధిపతి సంత్ శ్రీ జగదీశ్వర్ నందు మహారాజ్ అన్నారు. మంగళవారం ఖేడ్ మండలం శివార్ సందూర్ తండాలో హోలీ జాతర మహోత్సవంలో 21 మంది కన్నెలతో అభిషేకం, హోమం పూజలు నిర్వహించారు. స్థానిక యంత్ర తంత్ర త్రిశూలాన్ని దర్శించుకోవడంతో పాపాలు తొలిగి పోతాయని పేర్కొన్నారు.