ప్రకాశం: గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొని, పట్టాదారు పాసు పుస్తకములను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూమి హక్కు రైతుల భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వం ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉందన్నారు.