MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడంపై మాజీ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన, కొత్త భవనం పూర్తయినా వాడుకలోకి తేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య మేనని మండిపడ్డారు. మార్చురీలో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరం జరిగిందని విమర్శించారు.