తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కానీ ఇది కేవలం ఆహా గోల్డ్ వినియోగదారులకి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మార్చి 4 నుంచి సాధారణ సబ్స్క్రైబర్స్కి అందుబాటులోకి రాబోతుంది.