SKLM: చంద్రగ్రహణం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలు మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం, శ్రీముఖ లింగేశ్వర క్షేత్రం, ఎండల మల్లికార్జునస్వామి శైవక్షేత్రం మూసి వేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.