PDPL: ధర్మారం మండలం నంది మేడారం శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 5న శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజేష్ యాదవ్ తెలిపారు. ఉదయం 8:30కి గణపతి పూజ పుణ్య వచనం, 11:45కు శివపార్వతుల ఉత్సవ విగ్రహ చర ప్రతిష్ట, సాయంత్రం 5 గంటలకు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడతాయన్నారు. కావున భక్తులు ఈ పుణ్యకార్యంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.