TPT: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 33 వినతులు అందాయని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. 23 మంది ప్రత్యక్షంగా,10 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలియజేశారు. డిప్యూటీ మేయర్ ఆర్.సి. మునికృష్ణ వార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.