నల్గొండలోని అర్జాలబావిలో అరోరా లీగల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ ట్రాన్స్జెండర్ హక్కులపై అవగాహన సదస్సు జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ప్రకారం వారికి ఉన్న రక్షణలను, 2019 చట్టం ద్వారా లభించే విద్యా, ఉపాధి అవకాశాలను వివరించారు. స్మైల్ పథకం, ఆయుష్మాన్ భారత్, టీజీ ప్లస్ పథకాల గురించి వివరించారు.