ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ. 10,10,281 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ తాతయ్య వారి నివాసంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించుకోలేని పేదలకు సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటు అందిస్తుందని ఆయన అన్నారు.