NDL: డోన్ పట్టణంలో అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న హుస్సేన్పిర కుటుంబానికి చేయూత స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో రూ. 25 వేల ఆర్థిక సహాయం అందించారు. డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. రాజేంద్రప్రసాద్ రెడ్డి, యశోద హాస్పిటల్ అధినేత డా. సుంకన్న, చంద్రశేఖర్ ఈ సహాయాన్ని ఆదివారం అందజేశారు. ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వాలని దాతలు పిలుపునిచ్చారు.