అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి రైతు సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఆమెకు వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారి అభివృద్ధికి పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డులో రైతులకు సౌకర్యాలు కల్పించి, గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.