KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆయన, బాధ్యతా రాహిత్యం వహించిన పెద్దాపురం ఆర్డీవో, డీఎస్పీ, జిల్లా కార్మికశాఖ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.