TPT: వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అకోలా, చర్లపల్లి నుంచి తిరుపతికి పలు స్పెషల్ రైలు సర్వీసులను మరికొద్ది రోజులు పొడగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 8 వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.