కృష్ణా: పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీలో శ్రీ శ్రీ సాగర భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహర్షి సందేశాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.