NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు రవి రాజు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందనీ పేర్కొన్నారు.