KDP: మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో రైతు గురప్పకు చెందిన అరటి పంట దగ్ధమైంది. మూడెకరాల్లో సాగు చేసిన పంటలో ఎకరాన్నర పూర్తిగా కాలి బూడిదైంది. బిందు సేద్య పరికరాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను ఆర్పేందుకు రైతు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు.