VSP: ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావుకు పాశర్ల ప్రసాద్ శుక్రవారం టీడీపీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా BRTS బాధితుల సమస్యలను ప్రస్తావిస్తూ, 108 మందికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో TDRలు అందలేదన్నారు. రెండున్నరేళ్లుగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు GVMC అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలన్నారు.