ATP: గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో వీర బ్రహ్మేంద్ర స్వామి తిరుణాలలో భాగంగా శుక్రవారం మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసక్తి గల క్రీడాకారులు ఇవాళ సాయంకాలం లోపు రూ. 500 ఎంట్రీ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.