GDWL: అయిజలోని కర్నూల్-రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి వంతెనపై ఏర్పడిన ప్రమాదకర గుంతపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు ఎస్సై శ్రీనివాసులు తక్షణమే స్పందించారు. ఆదివారం జేసీబీ సహాయంతో ఆ గుంతను పూడ్చి మరమ్మతులు చేయించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్న ఎస్సైను వాహనదారులు అభినందించారు.