KNR: పొలం పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గాజుల రాజేశ్ (36) శనివారం సాయంత్రం పొలానికి వెళ్లి రాత్రి వరకూ తిరిగి రాలేదు. ఆందోళనతో వెతికిన కుటుంబ సభ్యులకు చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య రజిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు.