NLG: త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద ప్రయాణం నరకప్రాయంగా మారింది. బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పోసి చదును చేసి వదిలివేయడంతో రోడ్డు మార్గం అధ్వానంగా తయారైందని గ్రామస్తులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.