KRNL: ఉరుకుంద ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ వ్యవహారంపై రాజీనామాలు చేసిన వల్లూరి నాగేశ్వరరావు, వల్లూరి పట్టాభి తమ రాజీనామాలను ఇవాళ వెనక్కి తీసుకున్నారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు విజయవాడలో నారా లోకేష్ తదితరులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇతరులు కూడా రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.