KNR: సైదాపూర్ మండలంలోని విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలని సైదాపూర్ TGNPDCL అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ కోరారు. శనివారం సైదాపూర్ మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారులతో మాట్లాడారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది తదితరులు ఉన్నారు.