MNCL: మందమర్రి పట్టణంలోని శ్రీపతి నగర్లో పది రోజుల క్రితం పైప్ లైన్ కోసం తవ్విన గుంతలను అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొత్త రోడ్డు వేయడంతో ప్రత్యామ్నాయ దారి లేక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ అధికారులు స్పందించి గుంతలను పూడ్చివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.