KKD: ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతీక రాజధాని అమరావతి అని, రాష్ట్ర అభివృద్ధికి రాజధాని అమరావతి కేంద్ర బిందువుగా నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాకినాడ కూటమి శ్రేణులు తమ ఇళ్ల ముందు మన రాజధాని మన అమరావతి అని రంగవల్లికలతో ముగ్గులు వేశారు.