PPM: PHCలో పనిచేసే వైద్యులు అందుబాటులోనే ఉన్నారని, సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నారని DMHO డా. భాస్కర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 2న, ఓ పత్రికలో వైద్యులు ఉండరు, చికిత్స అందదు అనే కథనానికి ఆయన పై విధంగా స్పందించారు. జీ.ఎల్.పురం మండలం రేగడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.